Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజురోజుకూ కుంగిపోతున్న జోషిమఠ్.. శాటిలైట్ చిత్రాలు రిలీజ్ చేసిన ఇస్రో

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2023 (14:35 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం జోషీమఠ్‌ ప్రాంతం రోజురోజుకూ కుంగిపోతోంది. మరికొన్ని రోజులకు ఇది చాలా మేరకు కుంగిపోవచ్చని భూశాస్త్రవేత్తలు, ఇస్రో సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శాటిలైట్ ఫోటోలను తాజాగా రిలీజ్ చేసింది. పైగా, ఈ జోషిమఠ్ ఇలా ఎందుకు కుంగిపోతుందో కారణం తెలుసుకునేందుకు ఇప్పటికే పలు రంగాలకు చెందిన నిపుణులు ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. 
 
మరోవైపు ఇస్రో కీలక నివేదికను విడుదల చేసింది. డిసెంబరు 27వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు అంటే 12 రోజుల్లో జోషిమఠ్ టౌన్ 5.4 సెంటీమీటర్ల మేరకు కుంగిపోయిందని ఇస్రో తెలిపింది. దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను కూడా విడుదల చేసింది. 
 
గత యేడాది రెండో తేదీన జోషిమఠ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. అప్పటి నుంచి అక్కడ నేల కుంగిపోవడం ప్రారంభమైనట్టు అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి టౌన్‌లోని నార్సింగ్ ఆలం, ఆర్మీ హెలిపాడ్ వద్ద భూమి వేగంగా కుంగిపోయినట్టు చెబుతున్నారు. పట్టణంలోని 700 బిల్డింగుల్లో పగుళ్లు వచ్చినట్టు పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments