Webdunia - Bharat's app for daily news and videos

Install App

"జై తెలుగు" పేరుతో ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ

Webdunia
బుధవారం, 21 జూన్ 2023 (17:34 IST)
వచ్చే యేడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏపీలో ఒక కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. "జై తెలుగు" పేరుతో ఈ పార్టీని ప్రముఖ కవి, సినీ గేయరచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ప్రారంభించారు. ఈ పార్టీ జెండాను కూడా వెల్లడించారు. పసుపు, ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగుల మధ్యలో తెలుపు రంగుతో జెండాను రూపొందించారు. 
 
తెలుపు రంగుపై ఒక రథాన్ని ఏర్పాటు చేసి దానికి "అ ఆ" అక్షరాలను చక్రాలుగా పెట్టారు. రథానికి పైభాగంలో జెండా ఏర్పాటు చేశారు. ఈ వివరాలను రామ లింగేశ్వరరావు విజయవాడ ప్రెస్ క్లబ్‌లో వెల్లడించారు. తెలుగు భాష సంస్కృతి కోసం కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశానని చెప్పారు. తెలుగు భాష పరిరక్షణ ఆజెండాతోనే రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. 
 
పార్టీకి సంబంధించిన సదస్సులు ఆగస్టు నుంచి జిల్లాల వారీగా నిర్వహిస్తామని చెప్పారు. భాష, సంస్కృతులపై రాజకీయ నాయకులు, ప్రజలకు తగిన అవగాహన కల్పించడమే తన లక్ష్యమన్నారు. భాష, సంస్కృతుల విలువ అందరికీ తెలియజేయాలనే పార్టీని స్థాపించానన్నారు. పార్టీ జెండాపై గిడుగు రామ్మూర్తి, కందుకూరి వీరేశలింగం, పొట్టి శ్రీరాములు, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ చిత్రాలు ఉంటాయన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments