Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనరంజకంగా జగన్ పాలన.. 100కు 150 మార్కులు : జేసీ సెటైర్లు

Webdunia
బుధవారం, 23 అక్టోబరు 2019 (17:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్. జగన్మోహన్ రెడ్డి పాలన జనరంజకంగా సాగుతోందని, ఆయన పాలనకు వందకు 150 మార్కులు వేయొచ్చని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
ఆయన అమరావతిలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ, జగన్ పాలన జనరంజకంగా సాగుతోంది.. 100కి 150 మార్కులు వెయ్యాలని సెటైర్ వేశారు. జగన్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు తమ అబ్బాయే అన్నారు. అయితే పరిపాలనలో కిందామీద పడుతున్నాడన్నారు. 
 
రాష్ట్రంలో ఎన్నో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు తిరుగుతుంటే.. ఆయన కళ్లకు తమ ట్రావెల్స్ బస్సులో కనిపిస్తున్నాయన్నారు. పైగా, ఇప్పటివరకు 31 బస్సులను సీజ్ చేశారన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ చర్యలపై న్యాయపరంగా పోరాడతామన్నారు. 
 
తాము గత ఏడు దశాబ్దాలుగా వాహనరంగంలో ఉన్నామని.. చిన్న చిన్న లోటు పాట్లు ఆర్టీసీ సహా ఏ ట్రావెల్స్‌కైనా సహజమన్నారు. తన బస్సులనే భూతద్దంలో చూసి సీజ్ చేశారని.. ఫైన్‌లతో పోయే తప్పిదాలకు సీజ్ చేయటం ఎంతవరకు సబబు అని జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. 
 
రాజకీయ నేతలు ప్రతి ఒక్కరూ తమతమ ప్రాంత అభివృద్ధిని కోరుకోవడంలో తప్పులేదన్నారు. అదేసమయంలో గత టీడీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు. అయితే, నీటి నిల్వ ప్రాజెక్టులు లేకపోతే ఎన్ని వర్షాలు పడినా ఫలితముండదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments