Webdunia - Bharat's app for daily news and videos

Install App

11 గంటల్లోపు పబ్బులు, బార్లు మూసేయాలి.. నిషిత్ మృతి దారుణం: జేసీ

ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం దారుణమని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. యువకులు తమ వంశాన్ని ఉద్ధరిస్తారని భావిస్తే ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారనే వార్తను జీర్ణించుకోవడం కష్టమన్నారు.

Webdunia
బుధవారం, 10 మే 2017 (13:26 IST)
ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం దారుణమని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. యువకులు తమ వంశాన్ని ఉద్ధరిస్తారని భావిస్తే ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారనే వార్తను జీర్ణించుకోవడం కష్టమన్నారు. ధనవంతుల పిల్లల్లో విచ్చలవిడితనం పెరిగిందని రాత్రి 11 గంటల్లోపు పబ్బులు, బార్లు మూసేయాలని జేసీ కీలక వ్యాఖ్యలు చేశారు. యువకులు జాగ్రత్తగా ఉండాలని, అందుకు తల్లిదండ్రులు బాధ్యతలు తీసుకోవాలన్నారు. ఇంకా నిషిత్ మృతి పట్ల జేసీ ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. 
 
మరోవైపు నిషిత్ మృతి పట్ల టీడీపీ నేత నందమూరి హరికృష్ణ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నారాయణ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. కన్న కుమారుడిని కోల్పోతే ఎంత బాధ వుంటుందో తనకు తెలుసునని, మూడేళ్ల క్రితం తన కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఎంతో బాధించిందనే విషయాన్ని గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు.
 
నిషిత్ మృతి నేపథ్యంలో నారాయణ కుటుంబానికి ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అపోలోలో నారాయణ కుటుంబాన్ని ఓదార్చారు. హైదరాబాదులోని జూబ్లిహిల్స్, రోడ్ నెంబర్ 36లో మెట్రో పిల్లర్‌ను బెంజ్ కారు ఢీ కొట్టిన ఘటనలో మృతి చెందిన నిషిత్ నారాయణ, రాజారవివర్మ కుటుంబ సభ్యులను పవన్ కల్యాణ్ అపోలో ఆసుపత్రిలో కలిశారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చి.. వారికి ధైర్యం చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments