Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయసుధకు కీలక పదవి.. జగన్ పరిశీలన.. పోసాని, అలీకి ఏమిస్తారో?

Webdunia
ఆదివారం, 2 జూన్ 2019 (11:30 IST)
సీనియర్‌ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధను కీలక పదవి వరించనుందని టాక్ వస్తోంది. రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ) చైర్మన్‌ పదవికి ఆమెను ఎంపిక చేసే దిశగా రంగం సిద్ధమవుతుంది.


ఇందులో భాగంగా టీడీపీ హయాంలో ఈ పదవిలో నియమితుడైన అంబికాకృష్ణ ఇటీవల చైర్మన్‌ పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానంలో జయసుధను కూర్చోబెట్టేందుకు కొత్త సర్కారు రెడీ అవుతోంది. 
 
ఎన్నికల సమయంలో ఖాళీ అయిన ఎఫ్‌డీసీ చైర్మన్‌ గిరీ ఎవరికి దక్కుతుందా? అన్న టాక్‌ నడుస్తోంది. ఇందుకోసం జయసుధ పేరును జగన్‌ పరిశీలిస్తున్నారని సమాచారం.

సీనియర్‌ నటి కావడంతోపాటు పరిశ్రమలో అందరితో సత్సంబంధాలు ఉండడం ఆమెకు కలిసి వచ్చే అంశమని జగన్ భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. 
 
ఇకపోతే.. వైకాపా తరపున పృధ్వీరాజ్‌, అలీ, పోసాని, మోహన్‌బాబు, జయసుధ, జీవిత, రాజశేఖర్‌ తదితర ప్రముఖలు ప్రచారం నిర్వహించారు. పార్టీ అధికారంలోకి రావడంతో తమకు ఏదైనా కీలక పదవి దక్కుతుందన్న ఆశతో వున్నారు. మరి వీరికి ఎలాంటి పదవులు లభిస్తాయో వేచి చూడాలి మరి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments