Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని ప్రాంతంలో జపాన్ బృందం పర్యటన

Webdunia
బుధవారం, 27 మే 2015 (08:49 IST)
పర్యాటకంగా ఎలాంటి అభివృద్ధి చేయవచ్చో పరిశీలించడానికి రాజధాని ప్రాంతంలో జపాన్ బృందం పర్యటించింది. నిర్దేశిత ప్రాంతాలకు వెళ్లి మ్యాపుల ఆధారంగా వాస్తవ ప్రాంతాలను పరిశీలించారు. అక్కడ ఏ విధమైన డెవెలప్ మెంట్ చేయవచ్చో ఒక అవగాహనకు వచ్చారు. 
 
ఏడుగురు ప్రతినిధులతో కూడిన సింగపూర్ బృందం పరిశీలించింది. నూతన రాజధానికి మాస్టర్ ప్లాన్ ఇచ్చిన మర్నాడే ఈ బృందం రాజధాని ప్రాంతంలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. విజయవాడ నుంచి బయలుదేరిన ఈ బృందం ప్రకాశం బ్యారేజి మీదుగా గుంటూరు జిల్లా సీతానగరం చేరుకుని అక్కడ నుంచి ఉండవల్లి కరకట్ట మీదుగా తూళ్లూరు మండలం వెంకటపాలెం చేరుకున్నారు.
 
అక్కడి నుంచి మందడం మీదుగా తాళాయపాలెంలోని శ్రీశైవక్షేత్రానికి వెళ్లారు. అక్కడ ఐదు నిమిషాల పాటు మ్యాప్‌ల ఆధారంగా కృష్ణానదిని పరిశీలించారు. ఈప్రాంతాన్ని పర్యాటక రంగంగా తీర్చిదిద్దాలని రాజధాని మాస్టార్ ప్లాన్‌లో పొందు పరిచిన నేపథ్యంలో సింగపూర్ బృందం శ్రీశైవక్షేత్రంకు ఉత్తరంగా కనిపించే కృష్ణానది గురించి ఆసక్తి కనబరిచింది. పరిసర ప్రాంతాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈ బృందం విజయవాడ తిరుగు ప్రయాణమయ్యింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments