Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర‌స‌న ప్ర‌జ‌ల హ‌క్కే కానీ, ప్ర‌ధాని భ‌ద్ర‌తకు ఇబ్బంది క‌లిగిస్తారా?

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (16:39 IST)
ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఇపుడు బీజేపీ పైన ప్రేమ పెరిగిపోయిన‌ట్లుంది. అందుకే తాజాగా పంజాబ్ సంఘ‌ట‌న‌పై లేటుగా అయినా బీజేపీపై ప్రేమ‌గా స్పందించారు. ప్ర‌ధాని మోదీకి త‌న అభినంద‌న‌లు కూడా తెలిపారు ప‌వ‌న్.
 
 
పంజాబ్ రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఎదురైన సంఘటనను దురదృష్ణకరంగా భావిస్తున్నాన‌ని జ‌న‌సేన అధినేత‌ పవన్ కళ్యాణ్ అన్నారు. దేశ ప్రధాని ప్రయాణంలో 20 నిమిషాలపాటు ముందుకు వెళ్లలేక రోడ్డుపైనే ఆయన కారు నిలిచిపోయే పరిస్థితి అవాంఛనీయం అన్నారు. 
 
 
ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడం ప్రజల హక్కే అయినప్పటికీ, ప్రధాని భద్రతకు ఇబ్బంది కలిగేలా ఆ నిరసన ఉండరాదని భావిస్తున్నాన‌ని ప‌వ‌న్ చెప్పారు. ఎటువంటి పరిస్థితులలోనూ ప్రధాన మంత్రి గౌరవానికి భంగకరంగా ఏ పార్టీ ప్రభుత్వమైనా, ఎటువంటి వ్యక్తులైనా ప్రవర్తించరాద‌ని అన్నారు.  ప్రధాన మంత్రిని గౌరవించడం అంటే మన జాతిని, మన దేశాన్ని గౌరవించడమే. ఈ దుస్సంఘటన కావాలని చేసినట్లు నేను భావించడం లేదు.


అయితే ప్రధాన మంత్రి ఇతర రాష్ట్రాలలో పర్యటనకు వచ్చినప్పుడు ప్రోటోకాల్స్ ను తు.చ. తప్పకుండా పాటించవలసిన బాధ్యత ఆయా రాష్ట్రాలపైనే ఉంటుంది.  ఇది సర్వవిదితమే. మరోసారి ప్రధాన మంత్రికిగానీ, అత్యంత బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారెవరికీ ఇటువంటి పరిస్థితి ఎదురుకాకూడదని కోరుకుంటున్నాను అని ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో సంయమనం పాటించిన నరేంద్ర మోదీకి గౌరవపూర్వక అభినందనలు తెలియచేస్తున్నా అని ప‌వ‌న్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

చిత్రపరిశ్రమలో విపరీతమైన లింగ వివక్ష : నటి కృతి సనన్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments