Webdunia - Bharat's app for daily news and videos

Install App

గులాం గిరి చేయను... ఆత్మగౌరవం కోసం గొంతు కోసుకునే వ్యక్తిని : పవన్ కళ్యాణ్

Webdunia
బుధవారం, 7 నవంబరు 2018 (09:10 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకుని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు విమర్శలదాడి చేశారు. అలాగే, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిని, ప్రధాని నరేంద్ర మోడీపై కూడా విమర్శలు గుప్పించారు. 
 
జనసేన ప్రజాపోరాట యాత్రలో భాగంగా మంగళవారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు హెరిటేజ్‌ వ్యాపారం, జగన్‌కు కాంట్రాక్టులు ఆగిపోతాయని తెలంగాణ అంటేనే వారికి భయం పట్టుకుందన్నారు. జగన్‌ను వరంగల్‌లో కొట్టి తరిమేశారన్నారు. 
 
తెలంగాణ ప్రజలు ఇద్దరినీ రానివ్వరన్నారు. కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా మాట్లాడతాం కాబట్టే రెండు రాష్ట్రాలకూ జనసైనికులు వెళ్లగలరని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో దశాబ్దాలుగా ఉన్న నాయకులు మిగిలిన పార్టీలవైపు వస్తుంటే.. చంద్రబాబు వారి కాళ్లు పట్టుకుని అటువైపు వెళ్లడం బాధ కలిగించిందన్నారు. 
 
పైగా, ప్రధాని నరేంద్ర మోడీకి తాను దత్తపుత్రుడను కాదంటూ.. లోకేష్‌ కుమారుడు మోడీని తాతా తాతా అంటాడు.. వారికే ఆయనతో బంధుత్వాలు ఉన్నాయి. తనకు మోడీపై ఎటువంటి మోజూ లేదు, భయమూ లేదన్నారు. 'మీలా రెండు చేతులతో గులాం చేసే వాడిని కాదు.. ఆత్మగౌరవం కోసం గొంతు కోసుకునే వ్యక్తిని' అని అంటూ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments