Webdunia - Bharat's app for daily news and videos

Install App

గులాం గిరి చేయను... ఆత్మగౌరవం కోసం గొంతు కోసుకునే వ్యక్తిని : పవన్ కళ్యాణ్

Webdunia
బుధవారం, 7 నవంబరు 2018 (09:10 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకుని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు విమర్శలదాడి చేశారు. అలాగే, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిని, ప్రధాని నరేంద్ర మోడీపై కూడా విమర్శలు గుప్పించారు. 
 
జనసేన ప్రజాపోరాట యాత్రలో భాగంగా మంగళవారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు హెరిటేజ్‌ వ్యాపారం, జగన్‌కు కాంట్రాక్టులు ఆగిపోతాయని తెలంగాణ అంటేనే వారికి భయం పట్టుకుందన్నారు. జగన్‌ను వరంగల్‌లో కొట్టి తరిమేశారన్నారు. 
 
తెలంగాణ ప్రజలు ఇద్దరినీ రానివ్వరన్నారు. కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా మాట్లాడతాం కాబట్టే రెండు రాష్ట్రాలకూ జనసైనికులు వెళ్లగలరని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో దశాబ్దాలుగా ఉన్న నాయకులు మిగిలిన పార్టీలవైపు వస్తుంటే.. చంద్రబాబు వారి కాళ్లు పట్టుకుని అటువైపు వెళ్లడం బాధ కలిగించిందన్నారు. 
 
పైగా, ప్రధాని నరేంద్ర మోడీకి తాను దత్తపుత్రుడను కాదంటూ.. లోకేష్‌ కుమారుడు మోడీని తాతా తాతా అంటాడు.. వారికే ఆయనతో బంధుత్వాలు ఉన్నాయి. తనకు మోడీపై ఎటువంటి మోజూ లేదు, భయమూ లేదన్నారు. 'మీలా రెండు చేతులతో గులాం చేసే వాడిని కాదు.. ఆత్మగౌరవం కోసం గొంతు కోసుకునే వ్యక్తిని' అని అంటూ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments