Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరి 12న 'యువశక్తి' పేరుతో జనసేన బహిరంగ సభ

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (17:28 IST)
హీరో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ 2024లో జరిగే ఎన్నికల కోసం పక్కా ప్రణాళికలతో ముందుకుసాగుతోంది. ఇందులోభాగంగా, ఇప్పటికే కౌలు రైతు భరోసా, జనవాణి కార్యక్రామాలను నిర్వహించగా, అవి విజయవంతమయ్యాయి. దీంతో తాజాగా యువశక్తి పేరుతో ఏపీలో బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. 
 
ఇందులోభాగంగా తన మొదటి సభను ఈ నెల 12వ తేదీన శ్రీకాకుళంలో ఏర్పాటుచేయనున్నారు. ఈ సభలో జనసేన పార్టీ అదినేత పవన్ కళ్యాణ్ హాజరై ప్రసంగించనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ సభ ప్రారంభమవుతుందని జనసేన వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టరును విడుదల చేసింది. 
 
ఇందులో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై గళమెత్తడం కోసమే ఈ యువశక్తి సభలను నిర్వహిస్తున్నట్టు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ సభల ద్వారా రాష్ట్రంలోని యువతకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తామని, ఇలాంటి సభలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments