Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుషికొండకు బోడిగుండు కొట్టేశారు.. 21 ఎకరాల్లో తవ్వకాలు : జనసేన కార్పొరేటర్ మూర్తి

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2023 (08:37 IST)
విశాఖపట్ణంలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉన్న రిషికొండకు వైకాపా నేతలు బోడిగుండు కొట్టేశారని జనసేన ఆరోపించింది. ఇదే అంశంపై ఆ పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ, జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎస్జీటీ) నిబంధనలకు విరుద్ధంగా రుషికొండపై రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టిందని ఆరోపించారు. 
 
వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి హయాంలో రుషికొండ వద్ద భూములను ఒక వర్గానికి కేటాయించగా, వైకాపా హయాంలో వాటి వినియోగాన్ని మార్చేశారని ఆరోపించారు. రుషికొండపై 9.88 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టడానికి వైకాపా ప్రభుత్వం అనుమతులు తీసుకుని 21 ఎకరాల మేర కొండను తవ్వేసి నిర్మాణాలు చేపట్టిందని ఛాయాచిత్రాలతో హైకోర్టుకు నివేదించామన్నారు. 
 
తీర ప్రాంతానికి 200 మీటర్ల తర్వాతే నిర్మాణాలు ఉండాలని, తీర ప్రాంత నియంత్రణ పరిధి నిబంధనల మేరకు 9 మీటర్ల ఎత్తు వరకే కట్టడాలు ఉండాలని పేర్కొన్నారు. అలాగే ఎలాంటి యంత్రాలు వినియోగించకూడదన్నారు. రుషికొండలో ఆయా నిబంధనలన్నింటినీ ఉల్లంఘించారని ఆరోపించారు. అందుకే ప్రభుత్వం రుషికొండ నిర్మాణాలపై రోజుకో ప్రకటన చేస్తోందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అశ్వనీదత్ చేతిలో వున్న లెటర్ లో ఏముందో తెలుసా !

రౌతు కా రాజ్ వంటి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ చిత్రాల‌ను ఎంజాయ్ చేస్తుంటా : న‌వాజుద్దీన్ సిద్ధిఖీ

పీరియాడిక్ యాక్షన్ తో దసరాకు సిద్దమైన హీరో సూర్య చిత్రం కంగువ

రాజకీయాలకు స్వస్తి, గుడ్ బై: నటుడు అలీ (video)

అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. వీడియో వైరల్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

పిల్లలు స్వీట్ కార్న్ ఎందుకు తింటే..?

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments