Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీని తక్కువ అంచనా వేయొద్దు.. అందుకే పొత్తు పెట్టుకున్నాను : పవన్ కళ్యాణ్

Webdunia
సోమవారం, 2 అక్టోబరు 2023 (19:14 IST)
అధికార వైకాపాతో పాటు తెలుగుదేశం పార్టీని తక్కువ అంచనా వేయొద్దని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు, శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆయన తన నాలుగో విడత వారాహి విజయ యాత్రలో భాగంగా, సోమవారం మచిలీపట్నంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, కుల సమీకరణాల గురించి ఆలోచిస్తే ఎప్పటికీ అభివృద్ధి సాధ్యం కాదన్నారు. 
 
'పింగళి వెంకయ్య, రఘుపతి వెంకటరత్నం నాయుడు పుట్టిన నేల ఇది. దుబాయ్‌ వంటి చోట్ల మూడింట రెండొంతులు భారతీయులే ఉంటారు. కులాల ఐక్యత గురించి నేను పదే పదే చెబుతాను. ఏ ఒక్క కులం వల్లో అధికారం రాదని గుర్తించాలి. కాపు కులంలో పుట్టినా.. నేను అన్నింటినీ సమదృష్టితో చూసే వ్యక్తిని. నేను కులాలను వెదుక్కొని స్నేహాలు చేయను. వైకాపా కీలక పదవులన్నీ ఒక కులంతో నింపేస్తే అభివృద్ధి ఎలా సాధ్యం? కాపులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు.. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి. ఒక కులానికి మరో కులం పట్ల ఎందుకు ద్వేషం ఉండాలి?
 
సామాజిక వెనుకబాటును ఎలా రూపుమాపాలా అని అందరూ ఆలోచించాలి. నాలుగు ఎన్నికల్లో కష్టపడితే బీఎస్పీ అధికారంలోకి వచ్చింది. లేచిందే లేడికి పరుగు అన్నట్లు.. పార్టీ పెట్టగానే అధికారం రాదు. పార్టీ పెట్టగానే అధికారం అందుకోవడం ఒక్క ఎన్టీఆర్‌కే సాధ్యమైంది. జనసేన విశాలభావం ఉన్న పార్టీ.. ఇది ప్రాంతీయ పార్టీ కాదు. మున్ముందు జనసేన భావజాలమే దేశమంతా వ్యాపిస్తుంది' అని పవన్‌ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments