Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్.. మీరే నాకు నాయకుడు.. మీతోనే ఉంటా : జనసేన ఎమ్మెల్యే రాపాక

Webdunia
శుక్రవారం, 7 జూన్ 2019 (17:51 IST)
ముగిసిన ఎన్నికల్లో జనసేన పార్టీ చిత్తుగా ఓడిపోయింది. చివరకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోయారు. ఆ పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఓటమిపాలైనప్పటికీ.. తూర్పుగోదావరి జిల్లా రాజోలు అసెంబ్లీ స్థానంలో పోటీ చేసిన రాపాక వరప్రసాద్ ఒక్కరు మాత్రమే విజయం సాధించారు.
 
ఈ పరిస్థితుల్లో పార్టీ అధినేత జగన్‌ను ఎమ్మెల్యే రాపాక శుక్రవారం కలిశారు. పడమట లంకలో ఉన్న పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన రాపాక ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు పార్టీ ఓటమికి గల కారణాలపై చర్చించుకున్నారు. 
 
ఆ తర్వాత ఎమ్మెల్యే రాపాక మాట్లాడుతూ, తాను జనసేన పార్టీలోనే కొనసాగుతానని, వైకాపా ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తే స్వాగతిస్తానని, తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా విమర్శిస్తానని చెప్పారు. అలాగే, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని రాపాక ప్రకటించారు. అలాగే, తాను పార్టీ మారబోతున్న వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. తనకు అధినేత పవన్ అని, ఆయనతోనే ఉంటానని ప్రకటించారు. 
 
కాగా, ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాణ్ జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కృష్ణా జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించిన పవన్... శుక్రవారం ఉభయగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన పార్టీ నేతలు, పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అజిత్ కుమార్ పట్టుదలకు యు/ఎ సెన్సార్

అప్సరా రాణి రాచరికం మూవీ ఎలా ఉందంటే.. రాచరికం రివ్యూ

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments