Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిరోముండనం కేసులో వైకాపా ఎమ్మెల్యే తోట త్రిమూర్తులకు జైలుశిక్ష!!

వరుణ్
మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (15:10 IST)
వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు విశాఖపట్టణంలోని ఎస్సీఎస్టీ కోర్టు తేరుకోలేని షాకిచ్చింది. శిరోముండనం కేసులో ఆయనకు 18 నెలల పాటు జైలుశిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. దీంతో పాటు రూ.2.50 లక్షల అపరాధం కూడా విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈ కేసులో త్రిమూర్తులతో పాటు ఆరుగురు నిందితులను దోషులుగా నిర్ధారించింది. 
 
గత 28 యేళ్ళ క్రితం జరిగిన కేసులో కోర్టు ఈ సంచలన తీర్పును వెలువరించడం గమనార్హం. 1996 డిసెంబరు 29వ తేదీన దళితులను హింసించి, వారిలో ఇద్దరికి శిరోముండనం చేశారు. గుండు కొట్టించడంతో పాటు కనుబొమ్మలను కూడా తీసేశారు. ప్రస్తుతం కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాళెంలో ఈ ఘటన జరిగింది. అప్పట్లో ఈ ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. కాగా, కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై దోషులు హైకోర్టులో అప్పీల్ చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments