నరసాపురం పార్లమెంట్ టికెట్ రేసులో ప్రభాస్ పెద్దమ్మ?

సెల్వి
గురువారం, 11 జనవరి 2024 (19:37 IST)
ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. నరసాపురం పార్లమెంట్ టికెట్ కోసం ఆసక్తికర వార్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘురామ కృష్ణంరాజు గెలుపొందారు. అయితే.. విజయం సాధించిన కొన్ని రోజులకే ఆయన ఆ పార్టీని విభేదించారు. 
 
సీఎం జగన్‌ను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో ఆయన టీడీపీకి దగ్గరయ్యారు. టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఈ సారి ఆయన బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈసారి వైసీపీ టికెట్ ఎవరికి దక్కుతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
 
ప్రముఖ యువహీరో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలదేవి వైసీపీ టికెట్ రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే స్థానం నుంచి శ్యామలాదేవి భర్త కృష్ణం రాజు 1999లో ఎంపీగా గెలుపొందారు. 
 
వీరితో పాటు వైసీపీ టికెట్ రేసులో గోకరాజు గంగరాజు కుమారుడు గోకరాజు వెంకట కనక రంగరాజు కూడా టికెట్ రేసులో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఈ సీటు జగన్ ఎవరికిస్తారనే దానిపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : రష్మిక మందన్నా కు ప్రేమ పెండ్లి వర్కవుట్ కాదంటున్న వేణు స్వామి

Srileela: ఏజెంట్ మ్రిచిగా శ్రీలీల ఫస్ట్ లుక్ - కొత్త ట్విస్ట్

Vishnu Vishal: విష్ణు విశాల్... ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ రాబోతోంది

Sri Vishnu: మిత్ర మండలి ని మైండ్‌తో కాకుండా హార్ట్‌తో చూడండి : శ్రీ విష్ణు

తెలుసు కదా ఒక రాడికల్ సినిమా అవుతుంది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments