Webdunia - Bharat's app for daily news and videos

Install App

Amaravati 2.0: అమరావతి 2.0 ప్రాజెక్టుకు వైకాపా చీఫ్ జగన్‌కు ఆహ్వానం

సెల్వి
గురువారం, 1 మే 2025 (13:27 IST)
Jagan
ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని ప్రాజెక్టు పునఃప్రారంభం జరగబోతోంది. ఈ మెగా ఈవెంట్‌ను అమరావతి 2.0గా ప్రదర్శిస్తున్నారు. అమరావతి 2.0 ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్థానిక ప్రముఖులు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర క్యాబినెట్ మంత్రుల సమక్షంలో ప్రారంభించనున్నారు. 
 
తాజా వార్త ఏమిటంటే, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ తప్ప మరెవరికీ అమరావతి 2.0 ప్రాజెక్టుకు ఆహ్వానం అందలేదు. నివేదికల ప్రకారం, ఆహ్వాన కార్డును బుధవారం తాడేపల్లిలోని జగన్ నివాసంలో అసిస్టెంట్ ప్రోటోకాల్ అధికారి జగన్‌కు అందజేశారు.
 
ఇకపోతే 2015లోనే మొదటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి జగన్‌ను ఆహ్వానించినప్పటికీ, ఆయన దానికి హాజరు కావడానికి ఆసక్తి చూపలేదు. ఆపై 2019 ఎన్నికల తర్వాత అమరావతి ప్రాజెక్టును జగన్ పక్కనబెట్టేశారు. 
 
రాజధాని ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చాలా చరిత్ర ఉన్నందున, జగన్ 2.0 కార్యక్రమంలో పాల్గొనకుండా ఉంటారనే అంచనా స్పష్టంగా ఉంది. అయితే, భవిష్యత్తులో అమరావతి ప్రాజెక్టుకు రక్షణగా ఉండేలా క్యాబినెట్ ఆమోదం పొందే దిశగా చంద్రబాబు కార్యాచరణ చేస్తున్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మెగా ప్రాజెక్టును రాబోయే మూడేళ్లలో పూర్తి చేయడానికి కట్టుబడి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

HIT 3 Movie Review: క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ HIT మూవీ రివ్యూ రిపోర్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments