Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుపైనే ఒత్తిడి.. ప్రత్యేక హోదా హామీ మరిచిపోయారు: జగన్

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2015 (15:02 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావడం కోసమే దీక్షను చేపట్టామని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తెలిపారు. చంద్రబాబుపై ఒత్తిడిని పెంచితే.. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తారని జగన్ వ్యాఖ్యానించారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పారని, ఇప్పుడున్న ఉద్యోగాలను కూడా పీకేసే పరిస్థితి ఏర్పడిందని జగన్ విమర్శించారు. చదువుకున్న పిల్లలకు అన్యాయం జరుగుతోందని గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సందర్భంగా జగన్ వ్యాఖ్యానించారు. 
 
ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పిన చంద్రబాబు.. ప్రస్తుతం ఆ విషయాన్ని పూర్తిగా మరిచిపోయారని మండిపడ్డారు. హైదరాబాద్ లో 90 శాతం ఐటీ సంస్థలు, 70 శాతం పరిశ్రమలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో, ఏపీ విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎక్కడకు వెళ్లాలని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్, బీజేపీలు అడ్డగోలుగా విభజించాయని, కానీ, ఆనాడు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని మాత్రం మరిచిపోయారని మండిపడ్డారు. మేనిఫెస్టోలో ఉంచిన హామీలన్నింటినీ టీడీపీ తుంగలో తొక్కిందని జగన్ విమర్శలు గుప్పించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments