Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు మాట్లాడితే చంద్రబాబుకు ఏమయినా బుద్ధి, జ్ఞానం వస్తుందేమో? జగన్ ప్రశ్న

ప్రత్యేక హోదా సాధనలో భాగంగా గుంటూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో యువభేరి జరుగుతోంది. ఈ కార్యక్రమానికి యువత పెద్దఎత్తున హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం చేతిలో కీలుబొమ్మలా మారిపోయారనీ, వారు ఎలా

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2017 (13:41 IST)
ప్రత్యేక హోదా సాధనలో భాగంగా గుంటూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో యువభేరి జరుగుతోంది. ఈ కార్యక్రమానికి యువత పెద్దఎత్తున హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం చేతిలో కీలుబొమ్మలా మారిపోయారనీ, వారు ఎలా చెబితే అలా తలాడిస్తున్నారని జగన్ విమర్శించారు. తెలంగాణ రాదు అని చెప్పినప్పటికీ అక్కడి యువత అంతా ఒకతాటిపైకి వచ్చి రాష్ట్రాన్ని తెచ్చుకున్నారనీ, అలాంటిది ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం ఇచ్చిన మాటను మన యువత ఎందుకు సాధించుకోదో నిరూపిస్తామన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ యువతీయువకులతో కలిసి తమ పార్టీ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదాని సాధిస్తామన్నారు. అవసరమైతే తమ పార్టీ ఎంపీలందరూ రాజీనామా చేసి ఢిల్లీలో ధర్నా చేస్తారన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఎంతదూరమయినా వెళ్తామన్నారు. ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి సభలో పాల్గొన్న యువతీయువకులకు మైకులిచ్చి... మీరు మాట్లాడితే చంద్రబాబుకు ఏమయినా బుద్ధి, జ్ఞానం వస్తుందేమోనంటూ చెప్పారు. యువతీయువకులు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా పలు ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments