Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర ప్రభుత్వంపై 21న అవిశ్వాసం.. బాబు సహకరించాలి: జగన్

కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏపీలోని రాజకీయ పార్టీలు ఏకమయ్యాయి. ఏపీకి ప్రత్యేక హోదాకు సమానమైన నిధులిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన నేపథ్యంలో.. విభజన చట్టంలో వున్న హామీల

Webdunia
గురువారం, 8 మార్చి 2018 (09:24 IST)
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏపీలోని రాజకీయ పార్టీలు ఏకమయ్యాయి. ఏపీకి ప్రత్యేక హోదాకు సమానమైన నిధులిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన నేపథ్యంలో.. విభజన చట్టంలో వున్న హామీలను తప్పక ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఎంపీలు రాజీనామాలకు సిద్ధమయ్యారు. దీంతో ఎన్డీయే సర్కారుకు చుక్కలు చూపించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సన్నద్ధమయ్యారు. 
 
మరోవైపు ఏపీ విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్రంపై తన వంతు ఒత్తిడి తెచ్చేందుకు సై అంటున్నారు. ఇందులో భాగంగా ఏపీ రాష్ట్రాభివృద్ధికి దోహదపడే ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రంపై ఈ నెల 21వ తేదీన అవిశ్వాసం పెట్టేందుకు తాను నిర్ణయించామని.. అవిశ్వాసానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహకరించాలని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కోరారు. చంద్రబాబు బాగా ఆలోచించుకునేందుకు ఈ నెల 21వ తేదీ వరకు సమయం ఇచ్చామని జగన్ వ్యాఖ్యానించారు.
 
రాష్ట్రం మొత్తం ఒకే తాటిపై నిలబడి 25 మంది ఎంపీలు అవిశ్వాసానికి మద్దతుగా నిలిస్తే.. కేంద్రానికి తప్పకుండా ఓ సంకేతం వెళ్తుందని జగన్ అన్నారు. లేదంటే అవిశ్వాస తీర్మానాన్ని చంద్రబాబు పెడితే తాము మూకుమ్మడిగా మద్దతిస్తామని.. ఆపై 25మంది ఎంపీలతో మూకుమ్మడిగా రాజీనామాలు చేయిస్తే.. కేంద్రం దిగివస్తుందని జగన్ మీడియా ముందు గురువారం తెలిపారు. చంద్రబాబు ఈ సలహాపై ఆలోచించాలని జగన్ కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments