Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుడు 'చెప్పు' వ్యాఖ్య... ఇప్పుడు బాబుకు 'తోలు మందం' అంటూ జగన్

జగన్ మోహన్ రెడ్డి ఎంతమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మొన్న అనంతపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడ కనబడితే అక్కడ చెప్పులతో కొట్టాలంటూ వ్యాఖ్యానించిన జగన్ మోహన్ రెడ్డి, తాజాగా మరోసారి చంద్రబాబు నాయుడ

Webdunia
శనివారం, 4 జూన్ 2016 (13:52 IST)
జగన్ మోహన్ రెడ్డి ఎంతమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మొన్న అనంతపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడ కనబడితే అక్కడ చెప్పులతో కొట్టాలంటూ వ్యాఖ్యానించిన జగన్ మోహన్ రెడ్డి, తాజాగా మరోసారి చంద్రబాబు నాయుడిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలోని ఎన్‌పీ కుంటలో రైతు భరోసా యాత్రలో ఆయన మాట్లాడారు. 
 
ఈ సందర్భంగా ఆయన... చంద్రబాబుకు తోలు మందం ఎక్కువైందని, అందుకే రైతులను పట్టించుకోవడం లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. నియంత హిట్లర్ మాదిరిగా ప్రవర్తిస్తున్న చంద్రబాబు భూ కుంభకోణాలకు పాల్పడుతున్న వారిని వెనకేసుకొస్తున్నారంటూ విమర్శించారు. ఇదిలావుండగా మొన్న జగన్ మోహన్ రెడ్డి సీఎంను చెప్పులతో కొట్టాలంటూ వ్యాఖ్యలు చేయడంపై తెదేపా శ్రేణులు తీవ్ర నిరశనను తెలియజేస్తున్నాయి. ఐతే జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఎంతమాత్రం వెనక్కి తగ్గడంలేదు. తనదైన పంథాలో వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments