Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ హిందువు కాదు క్రైస్తవుడు: పరిపూర్ణానందస్వామి

Webdunia
గురువారం, 8 ఏప్రియల్ 2021 (17:55 IST)
ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి హిందువు కాదు.. క్రైస్తవుడని స్పష్టం చేశారు శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ హిందువని నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయ ప్రమేయం లేని స్వచ్ఛమైన హిందువులతో టిటిడి బోర్డు ఏర్పాటు చేయలేరా అంటూ ప్రశ్నించారు పరిపూర్ణానందస్వామి.
 
రాయలసీమ ఆధ్మాత్మిక వైభవాన్ని నాయకులు చాటిచెప్పలేకపోతున్నారని విమర్సించారు. రాయలసీమ విలువలను జాతీయస్థాయిలో నిలబెట్టేలా ఓటర్లు ఆలోచించాలన్నారు. వైసిపి ప్రభుత్వంలో 350 ఆలయాలు కూలిపోయాయని.. దేవదాయశాఖామంత్రి సిఎంకి చెప్పినా స్పందించరా అంటూ ప్రశ్నించారు.
 
తిరుమల శ్రీవారి ఆస్తులు, భూములు, క్రయ విక్రయాలపై 25 సంవత్సరాల శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. సమాచార హక్కు చట్టం పరిధిలోకి టిటిడిని తీసుకురావాలన్నారు. ఆలయంలో అన్యమతస్తులు పేరుకుపోతున్నా ఎవరూ మాట్లాడటం లేదని మండిపడ్డారు.
 
పింక్ డైమండ్ వ్యవహారం ఏమైందని ప్రశ్నించిన పరిపూర్ణానందస్వామి అధికారంలోకి రావాలంటే శ్రీవారిపై మాట్లాడాలనే భావజాలం ఏర్పడిపోయిందన్నారు. దేవుడు గుర్తుకు రావాల్సిన ప్రాంతం కేంద్రంగా రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. తిరుపతి అంటేనే వివాదాల పుట్టగా మారిపోయిందన్నారు పరిపూర్ణానందస్వామి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments