Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ హిందువు కాదు క్రైస్తవుడు: పరిపూర్ణానందస్వామి

Webdunia
గురువారం, 8 ఏప్రియల్ 2021 (17:55 IST)
ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి హిందువు కాదు.. క్రైస్తవుడని స్పష్టం చేశారు శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ హిందువని నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయ ప్రమేయం లేని స్వచ్ఛమైన హిందువులతో టిటిడి బోర్డు ఏర్పాటు చేయలేరా అంటూ ప్రశ్నించారు పరిపూర్ణానందస్వామి.
 
రాయలసీమ ఆధ్మాత్మిక వైభవాన్ని నాయకులు చాటిచెప్పలేకపోతున్నారని విమర్సించారు. రాయలసీమ విలువలను జాతీయస్థాయిలో నిలబెట్టేలా ఓటర్లు ఆలోచించాలన్నారు. వైసిపి ప్రభుత్వంలో 350 ఆలయాలు కూలిపోయాయని.. దేవదాయశాఖామంత్రి సిఎంకి చెప్పినా స్పందించరా అంటూ ప్రశ్నించారు.
 
తిరుమల శ్రీవారి ఆస్తులు, భూములు, క్రయ విక్రయాలపై 25 సంవత్సరాల శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. సమాచార హక్కు చట్టం పరిధిలోకి టిటిడిని తీసుకురావాలన్నారు. ఆలయంలో అన్యమతస్తులు పేరుకుపోతున్నా ఎవరూ మాట్లాడటం లేదని మండిపడ్డారు.
 
పింక్ డైమండ్ వ్యవహారం ఏమైందని ప్రశ్నించిన పరిపూర్ణానందస్వామి అధికారంలోకి రావాలంటే శ్రీవారిపై మాట్లాడాలనే భావజాలం ఏర్పడిపోయిందన్నారు. దేవుడు గుర్తుకు రావాల్సిన ప్రాంతం కేంద్రంగా రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. తిరుపతి అంటేనే వివాదాల పుట్టగా మారిపోయిందన్నారు పరిపూర్ణానందస్వామి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments