Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు వాహన మిత్ర నిధుల విడుదల - విశాఖకు వెళ్లనున్న సీఎం జగన్

Webdunia
గురువారం, 14 జులై 2022 (19:35 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి శుక్రవారం విశాఖపట్టణంకు వెళుతున్నారు. వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఒకటైన వాహన మిత్ర నిధులను అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు వెళుతున్నారు. 
 
నిజానికి ఆయన ఈ నెల 13వ తేదీనే విశాఖకు వెళ్లాల్సివుంది. కానీ, వర్షాల కారణంగా ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలించడంతో విశాఖకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 
 
కాగా, ఈ పర్యటనలో వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం లబ్దిదారుల ఖాతాల్లో ఈ యేడాది నిధులను ఆయన జమ చేయనున్నారు. సొంత వాహనాలు కలిగిన ఆటో, క్యాబ్ డ్రైవర్లకు యేడాదికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం చేసేలా ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించిన విషయం తెల్సిందే. ఈ పథకం కింద మొత్తం రూ.261 కోట్లను జమ చేస్తారు. 
 
మరోవైపు, ఈ పర్యటనలో భాగంగా, ఆయన ఆంధ్రా విశ్వవిద్యాయంలో ఏర్పాటుచేసిన వేదికపై నుంచి ఈ నిధులను విడుదల చేసి ఆ తర్వాత లబ్ధిదారులతో ఆయన ముఖాముఖి నిర్వహిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన తాడేపల్లికి తిరిగి చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: దయచేసి సినిమాను చంపకండి, ఒకరినొకరు అభినందించుకోండి.. ఫ్యాన్స్‌కు పవన్ హితవు

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments