Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం నిషేధం అమలుపై జగన్ ప్రభుత్వం తొలి అడుగు

Webdunia
బుధవారం, 7 ఆగస్టు 2019 (08:30 IST)
ఏపీలో దశలవారీగా మద్యం నిషేధం అమలు చేసేందుకు జగన్ సర్కార్ దృష్టిసారించింది. తొలి విడతగా 20శాతం మద్యం అమ్మకాలను తగ్గించేలా చర్యలకు శ్రీకారం చుట్టింది. కార్పొరేషన్ ద్వారా మద్యం అమ్మకాలపై విధివిధానాలను రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే ఏపీ బేవరెజేస్ కార్పొరేషన్ ద్వారా అమ్మకాలు జరిపేందుకు రంగం సిద్ధమైంది.
 
రాష్ట్ర వ్యాప్తంగా 4,377 షాపులకు గానూ 3,500 షాపుల్లోనే మద్యం అమ్మకాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న షాపులనే అద్దెకు తీసుకుని కొనసాగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మద్యం అమ్మకాల కోసం ప్రతి షాపునకు ఓ సూపర్ వైజర్, ఇద్దరు సేల్స్‌మెన్‌లను కార్పొరేషన్ నియమించుకోనుంది.

ఈ నియామాకాలన్నీ ఔట్ సోర్సింగ్ పద్ధతిన జరపాలని నిర్ణయించారు. ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు మద్యం నిషేధంపై ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments