Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుర్లలో డయేరియా: మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్ గ్రేషియా

సెల్వి
శుక్రవారం, 25 అక్టోబరు 2024 (10:15 IST)
గుర్లలో విజృంభిస్తున్న అతిసారంపై టీడీపీ సంకీర్ణ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎండగడుతూ, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. 
 
విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో అతిసార వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న వారిని జగన్ మోహన్ రెడ్డి గురువారం పరామర్శించి మృతుల కుటుంబాలను ఓదార్చారు. ప్రభుత్వం పారిశుద్ధ్యం సక్రమంగా నిర్వహించకపోవడమే ఈ వ్యాధికి కారణమని, గత ఐదు నెలలుగా వాటర్‌ క్లోరినేషన్‌ చేపట్టకపోవడాన్ని ఆయన ఎత్తిచూపారు.
 
గుర్ల గ్రామంలో జగన్‌మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మృతుల కుటుంబానికి వైఎస్సార్‌సీపీ 2 లక్షల రూపాయల ఆర్థికసాయాన్ని అందజేస్తుందని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఎంత సాయం చేస్తుందో కూడా వెల్లడించాలని డిమాండ్ చేశారు. 
 
మృతుల సంఖ్యకు సంబంధించి జిల్లా కలెక్టర్, ఉపముఖ్యమంత్రి ఇద్దరూ పరస్పర విరుద్ధమైన గణాంకాలు చెబుతున్నారని, పరిస్థితి తీవ్రతను ప్రభుత్వం తగ్గించిందని ఆయన విమర్శించారు. సమస్యను కప్పిపుచ్చేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, తన ట్వీట్ తర్వాతనే సంక్షోభంపై ప్రభుత్వం స్పందించిందని ఆయన ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నువ్వు స్టార్ అవుతావురా చెక్ తీసుకో అంటే మాటరాలేదు: విజయ్ దేవరకొండ

37 రోజుల్లో నరకం అనుభవించాం.. ఎంతో కోల్పోయాను : జానీ మాస్టర్

పట్టలేని ఆనందంలో రేణూ దేశాయ్ .. ఎందుకో తెలుసా?

సాయి దుర్గా తేజ్ 18వ చిత్రానికి బి. అజనీష్ లోక్‌నాథ్ స్వరకర్తగా ఎంట్రీ

సారంగపాణిలో ప్రణయ గీతంలో అలరిస్తున్న ప్రియదర్శి, రూపా కొడువాయుర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ సమయాల్లో మంచినీరు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

అల్లం టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ఇన్‌స్టంట్ నూడుల్స్ తినేవారు తప్పక తెలుసుకోవాల్సినవి

డోజీ సంచలనాత్మక అధ్యయనం: ఏఐ-ఆధారిత ముందస్తు హెచ్చరిక వ్యవస్థ రోగి ఆరోగ్య పరిస్థితి అంచనా

దాల్చిన చెక్కలో దాగున్న ఆరోగ్య రహస్యాలు

తర్వాతి కథనం
Show comments