Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుర్లలో డయేరియా: మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్ గ్రేషియా

సెల్వి
శుక్రవారం, 25 అక్టోబరు 2024 (10:15 IST)
గుర్లలో విజృంభిస్తున్న అతిసారంపై టీడీపీ సంకీర్ణ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎండగడుతూ, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. 
 
విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో అతిసార వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న వారిని జగన్ మోహన్ రెడ్డి గురువారం పరామర్శించి మృతుల కుటుంబాలను ఓదార్చారు. ప్రభుత్వం పారిశుద్ధ్యం సక్రమంగా నిర్వహించకపోవడమే ఈ వ్యాధికి కారణమని, గత ఐదు నెలలుగా వాటర్‌ క్లోరినేషన్‌ చేపట్టకపోవడాన్ని ఆయన ఎత్తిచూపారు.
 
గుర్ల గ్రామంలో జగన్‌మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మృతుల కుటుంబానికి వైఎస్సార్‌సీపీ 2 లక్షల రూపాయల ఆర్థికసాయాన్ని అందజేస్తుందని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఎంత సాయం చేస్తుందో కూడా వెల్లడించాలని డిమాండ్ చేశారు. 
 
మృతుల సంఖ్యకు సంబంధించి జిల్లా కలెక్టర్, ఉపముఖ్యమంత్రి ఇద్దరూ పరస్పర విరుద్ధమైన గణాంకాలు చెబుతున్నారని, పరిస్థితి తీవ్రతను ప్రభుత్వం తగ్గించిందని ఆయన విమర్శించారు. సమస్యను కప్పిపుచ్చేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, తన ట్వీట్ తర్వాతనే సంక్షోభంపై ప్రభుత్వం స్పందించిందని ఆయన ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments