Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్, కేసీఆర్ విగ్రహాల్లా మారారు, ధ్వంసం చేస్తుంది బీజేపి అని అనుమానం, ఎవరు?

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (18:53 IST)
తిరుపతిలో సిపిఐ జాతీయ కార్యదర్సి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కార్పొరేట్ కంపెనీలకు మోడీ దాసోహమంటున్నారని ఆరోపించారు. రైతులు రోడ్లపై నిరసన వ్యక్తం చేస్తుంటే ఎందుకు నరేంద్ర మోడీ పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
కలిసికట్టుగా ప్రజాసంఘాలు ఒకే వేదికపై వెళ్ళాల్సిన అవసరం ఉందని.. దేశవ్యాప్తంగా రైతులకు సంఘీభావంగా ఆందోళనలు చేయాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు సిపిఐ నేత నారాయణ. అసలు బిజెపి నేతలే హిందూ దేవాయాల్లో విగ్రహాలను ధ్వంసం చేసి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. 
 
ఎపిలో పాగా వేసేందుకు మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని.. గతంలో కూడా ఇదేవిధంగా చేసిందన్నారు సిపిఐ నారాయణ. ఎపి సిఎం, తెలంగాణా సిఎంలు ఇద్దరూ విగ్రహాలుగా మారిపోయారని.. కేంద్రానికి సాగిలపడి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తెచ్చుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. తిరుపతిలో స్వయంగా ట్రాక్టర్ నడిపిన సిపిఐ నారాయణ రైతులకు తన పూర్తి మద్ధతును ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments