Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరిటాల రవి హత్య కేసు : సందేహం ఉంటే విచారణ.. జేసీ

Webdunia
మంగళవారం, 19 ఆగస్టు 2014 (16:16 IST)
పరిటాల రవి హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఒక వేళ తనపై ఇంకా సందేహం ఉన్నా మరోమారు విచారణ జరిపించుకోవచ్చని అనంతపురం టీడీపీ ఎంపీ, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలోని టీడీఎల్పీ కార్యాలయం వద్ద ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
తనపై గతంలోనే విచారణ చేశారని... అవసరమనుకుంటే మరోసారి విచారణకు తాను సిద్ధమని చెప్పారు. వైకాపా అధినేత జగన్ తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పరిటాల రవి హత్యతో తనను ముడిపెట్టేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.
 
కాగా... హత్యారాజకీయాలపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చకు అనుమతించాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు వైకాపా సభ్యులు మంగళవారం నోటీసు ఇచ్చారు. ప్రశ్నోత్తరాలు కొంచెం సేపు జరిగిన తర్వాత... తాము ఇచ్చిన నోటీసుకు అనుగుణంగా రాష్ట్రంలోని శాంతి భద్రతలపై చర్చకు అనుమతివ్వాలని వైకాపా సభ్యులు స్పీకర్‌ను డిమాండ్ చేశారు.

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments