Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మురికి వ్యాఖ్యలను పట్టించుకోవద్దు.. ఐవైఆర్‌ కృష్ణారావుకు గవర్నర్ ఓదార్పు

గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ ఐవైఆర్‌ కృష్ణారావుపై పేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దాడులకు ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ సులువైన పరిష్కారం కనుగొన్నారు. మురుగు కాల

Webdunia
గురువారం, 22 జూన్ 2017 (04:36 IST)
గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ ఐవైఆర్‌ కృష్ణారావుపై పేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దాడులకు ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ సులువైన పరిష్కారం కనుగొన్నారు. మురుగు కాలువ స్థాయి మనుషులు చేసే వికృత చేష్ట్యలను మీరు పట్టించుకోవద్దు. ఇలాంటి మురికి వ్యాఖ్యలను పట్టించుకుంటే  'డ్రైనేజీ పీపుల్' స్థాయి పెంచినట్లు అవుతుంది కాబట్టి వాటి గురించి పట్టించుకోవద్దని గవర్నర్ సలహా ఇచ్చారు.
 
విషయం ఏమిటంటే.. సామాజిక మాధ్యమాల్లో తనను అవమానించేలా, అవహేళన చేస్తూ అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని గవర్నరు నరసింహన్‌కు ఆంధ్రప్రదేశ్‌ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ ఐవైఆర్‌ కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నరును కలిశారు. ఈ సందర్భంగా కొందరు పనిగట్టుకుని తన ప్రతిష్టను దెబ్బతీసేలా దురుద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నారని, ఇలాంటి వాటికి అడ్డుకట్టపడేలా చర్యలు  తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. 
 
‘ఇలాంటి అభ్యంతరకర పోస్టులు పెట్టినవారు, వాటిని చూపెట్టినవారు మురుగు కాలువ (డ్రెయినేజి) స్థాయి మనుషులు. మీరు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేయడమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గౌరవ ప్రతిష్టలున్నవారు. మురుగు కాలువ స్థాయి వ్యక్తులు చేస్తున్న వాటి గురించి ఆలోచించడం ద్వారా మీ స్థాయిని తగ్గించుకోవద్దు. మీరు వాటి గురించి ఆలోచిస్తే ‘డ్రైనేజి పీపుల్‌’ స్థాయి పెంచినట్లు అవుతుంది. అసలు వాటి గురించి పట్టించుకోవద్దు..’ అని ఈ సందర్భంగా గవర్నరు ఆయనకు ఉద్బోధించారు.
 
గవర్నర్ ఇలా నర్మగర్భంగా ఎవరిని ఉద్దేశించి అన్నారంటూ సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments