Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలాంటి దరిద్రపు లీకేజీల పేటెంట్ హక్కులు టీడీపీకీ సొంతం: ఐవైఆర్

Webdunia
శనివారం, 16 మార్చి 2019 (14:40 IST)
అమరావతి ప్రజావేదిక వద్ద ప్లకార్డులతో ఆందోళన చేసినందుకుగాను కొంతమంది బ్రాహ్మణులను తీసుకురావాలని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని చెప్తున్నట్లు గల ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై బీజేపీ నేత, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందిస్తూ.. టీడీపీపై మండిపడ్డారు. 
 
యామినిగారి ఆడియోను టీడీపీ అధిష్టానమే పచ్చ మీడియాకు లీక్ చేసిందని ఆరోపించారు. ఇలాంటి దరిద్రపు లీకేజీల విషయంలో టీడీపీ అధిష్టానానికి, ఎల్లో మీడియాకు పేటెంట్ హక్కు వుందని ఎద్దేవా చేశారు. విపనేతలపై దాడిచేయడానికి యామిని వాగ్ధాటి పనికి వచ్చిందనీ, ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఇలా పక్కన పెట్టారని దుయ్యబట్టారు. 
 
ఈ మేరకు ఐవైఆర్ కృష్ణారావు ట్విట్టర్‌లో స్పందించారు. అవసరమైతే వాడుకోవడం.. అవసరం తీరిపోయిన వారిని పక్కనబెట్టేయడం టీడీపీకి బాగా అలవాటేనని కృష్ణారావు ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments