Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాగుంట కంపెనీల్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు

Webdunia
ఆదివారం, 9 డిశెంబరు 2018 (12:19 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెందిన బాలాజీ గ్రూపునకు చెందిన కంపెనీల కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు మూడో రోజు కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. ఆ గ్రూపునకు చెందిన కార్యాలయాలతో పాటు 13 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 
 
తమిళనాడులోని మాగుంట గ్రూపు సంస్థల వ్యాపార లావాదేవీలన్నీ చెన్నై బజుల్లా రోడ్డులోని ప్రధాన కార్యాయం ద్వారానే సాగుతుంటాయి. ప్రధాన కార్యాలయంతో పాటు చెన్నై శివారు పూందమల్లిలోని మద్యం తయారీ ఫ్యాక్టరీలో అవినీతి నిరోధకశాఖ చేపట్టిన తనిఖీల్లో అత్యంత కీలక పత్రాలతో పాటు.. కోట్లాది రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. 
 
కాగా, గత నెల 30వ తేదీన రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు చెన్నైలోని ఒక స్టార్‌ హోటల్‌పై నిఘాపెట్టి భారీ స్థాయిలో 7 కిలోల విదేశీ బంగారు బిస్కెట్లు, రూ.16 కోట్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా దీంతో సంబంధం ఉన్న కొరియా దేశానికి చెందిన ఇద్దరు యువతులను, చెన్నైకి చెందిన హవాలా వ్యాపారిని అరెస్ట్‌ చేశారు. వాటికి కొనసాగింపుగానే మాగుంట కార్యాలయంపై దాడులు జరిపారనే వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments