Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లీజ్... ముందస్తు బెయిల్ ఇవ్వండి : హైకోర్టులో కాంతిరాణా టాటా పిటిషన్

ఠాగూర్
శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (20:29 IST)
ముంబై నటి కాదంబరి జెత్వానీపై తప్పుడు కేసు బనాయించి అక్రమంగా అరెస్టు చేసి వేధించిన కేసులో విజయవాడ పూర్వ కమిషనర్ కాంతిరాణా టాటాకు అరెస్టుభయం పట్టుకుంది. దీంతో తనను అరెస్టు చేయకుండా ఉండేందుకు వీలుగా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతా ఆయన శుక్రవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, కాదంబరి జెత్వానీ అక్రమ అరెస్టు అంశంలో నాటి నిఘా విభాగం ఐజీ పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విజయవాడ అసిస్టెంట్ కమిషనర్‌గా ఉన్న విశాల్ గున్నిలు కీలక పాత్ర పోషించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో వీరిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పైపెచ్చు, వీరి పేర్లను కూడా ఎఫ్ఐఆర్‌లో చేర్చనున్నట్టు సమాచారం. 
 
ఈ నేపథ్యంలో ఐపీఎస్ అధికారి కాంతిరాణా టాటా ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కాంతి రాణా పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం అంటే ఈ నెల 23వ తేదీన విచారణ చేపట్టనుంది. కాగా, నటి కాందబరి జెత్వానీపై అక్రమ కేసు, నిర్బంధం, వేధింపుల అంశాల్లో ముగ్గురు ఐపీఎస్‌ అధికారులపై ఆరోపణలు రాగా, డీజీపీ నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించారు. దీన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులపై సస్పెండ్‌కు అనుమతిచ్చారు. దీంతో ఆ ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

అంజీర మిల్క్ తాగితే ప్రయోజనాలు ఏమిటి?

మామిడి ఆకులతో మధుమేహం పరార్.. ఇవి తెలిస్తే?

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

తర్వాతి కథనం
Show comments