Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు కళాశాలలో ర్యాగింగ్ భూతం.. అనంత విద్యార్థి ఆత్మహత్య...

Webdunia
శుక్రవారం, 31 జులై 2015 (13:32 IST)
కళాశాలల్లో సీనియర్ విద్యార్థుల ఆగడాలు ఆగడం లేదు. ర్యాగింగ్‌‌పై ఎన్ని చట్టాలు చేసిన ప్రయోజనం లేకుండా పోతుంది. ర్యాగింగ్ పేరుతో సీనియర్ విద్యార్థులు జరిపే వేధింపులను భరించలేక ప్రాణాలు తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. తాజాగా నెల్లూరు జిల్లాలోని ఒక కళాశాలలో విద్యార్థుల ర్యాగింగ్‌ తట్టుకోలేక అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా ఓడీసీ మండలం దొమ్మితోటవారిపల్లెకు చెందిన మధువర్థన్ రెడ్డి.. నెల్లూరు జిల్లాలో ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. సీనియర్లు ర్యాగింగ్ వేధింపులు భరించలేక మధువర్ధన్ రెడ్డి సొంతూరుకు చేరాడు. కాలేజీలో విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారని.. వేధింపులు తట్టుకోలేక ఇంటికొచ్చానని తల్లిదండ్రులకు తెలిపాడు. 
 
ఈ క్రమంలో భవిష్యత్‌పై తీవ్ర మనో వేదనకు గురైన మధువర్ధన్ రెడ్డి గురువారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నట్లు కాలేజీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments