ఏపీలో పరీక్షల షెడ్యూల్ : వేసవిలో ఇంటర్ ఎగ్జామ్స్

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (08:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరీక్షల షెడ్యూల్‌ను ఆ రాష్ట్ర విద్యా శాఖ విడుదల చేసింది. ఇందులోభాగంగా, వేసవిలో ఇంటర్ పరీక్షలను నిర్వహించనుంది. ముఖ్యంగా, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రాష్ట్రంలో ఇంటర్ తరగతులు ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ప్రకటించారు. ​ఈ వేసవిలో మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 5 నుంచి 22వ తేదీ వరకు ఫస్టియర్ పరీక్షలు, మే 6 నుంచి 23వ తేదీ వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. 
 
మార్చి 31 నుంచి ఏప్రిల్ 24 వరకు ప్రాక్టికల్స్ ఉంటాయి. కాగా, ఇంటర్ పనిదినాల కుదింపు కారణంగా ప్రాక్టికల్స్ కు సంబంధించిన సిలబస్ లో 30 శాతం తగ్గించారు. ఈ మేరకు రాష్ట్ర ఇంటర్ విద్యామండలి వెల్లడించింది. అటు, తెలంగాణలో మే 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments