Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరేబియా సముద్రంలో అల్పపీడనం.. మండే ఎండల్లో వర్షాలు..

మండే ఎండల నుంచి ఉపశమనం లభించనుంది. తెలగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రత నుంచి ప్రజలకు ఉపశమనం పొందే అవకాశాలున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం... వాయుగుండంగా మారే అవకాశం ఉండటంతో తెలుగు రాష

Webdunia
బుధవారం, 14 మార్చి 2018 (10:07 IST)
మండే ఎండల నుంచి ఉపశమనం లభించనుంది. తెలగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రత నుంచి ప్రజలకు ఉపశమనం పొందే అవకాశాలున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం... వాయుగుండంగా మారే అవకాశం ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే సూచనలున్నాయని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది.
 
అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్రలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలున్నాయని.. మహారాష్ట్ర, కేరళ ప్రాంతాలకు కూడా వర్ష సూచనలున్నాయని తెలిపారు. వేసవి తాపాన్ని ఈ వర్షాలు తగ్గిస్తాయని వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు. 
 
అరేబియాలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడు, కేరళ, దక్షిణాది ప్రాంతాల్లో వచ్చే 48 గంటల్లో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. దీంతో తమిళనాడు, కేరళ దక్షిణ సముద్ర తీర ప్రాంతాలకు చెందిన జాలరులు చేపల వేటకు వెళ్ళకూడదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments