Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి ఉప ఎన్నికకు పెరిగిన ఓటర్లు

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (11:45 IST)
గత రెండున్నరేళ్లలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొత్త ఓటర్ల సంఖ్య పెరిగింది. వీరికి తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఓటు హక్కు కల్పిస్తు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి 15 నుంచి ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.

ఈ మేరకు మార్చి 31వ తేది నాటికి తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో 4546 మంది కొత్త ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. నియోజకవర్గాలవారీగా.. తిరుపతిలో 280351 నుంచి 282342, శ్రీకాళహిస్తిలో 244824 నుంచి 247561, సత్యవేడులో 209884 నుంచి 210704కు ఓటర్ల సంఖ్య పెరిగింది.

ఈ మేరకు కొత్త ఓటర్ల జాబితాను జిల్లా  యంత్రాంగం సిద్ధం చేసి రెండు రోజుల క్రితం నియోజకవర్గాల ఎన్నికల అధికారులకు రాజకీయ పార్టీల ప్రతినిధులకు పంపింది. 
 
కొవిడ్‌ నిబంధనలను పాటిస్తు తిరుపతి ఉప ఎన్నికల కోసం పోలింగ్‌ కేంద్రాలను పెంచేందుకు జిల్లా  యంత్రాంగం పంపిన ప్రతిపాదనకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది.

ప్రస్తుతం మూడు నియోజకవర్గాలో 830 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా అధనంగా 226  కొత్త పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఆమోదంతో కేంద్రాల సంఖ్య తాజాగా 1056కు పెరిగాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments