Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ పాఠశాలలో ఎల్కేజీ - యూకేజీ

Webdunia
బుధవారం, 22 జులై 2020 (08:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ప్రైవేటు స్కూల్స్‌లోనే ఉన్న ఎల్కేజీ, యూకేజీలను ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రవేశపెట్టాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా విద్యావ్యవస్థలో ప్రాథమిక పాఠశాల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అధికారులను కోరారు. 
 
ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయంతో వచ్చే యేడాది నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఎల్కేజీ, యూకేజీ విద్యను ప్రవేశపెట్టనున్నారు. ప్రీ ప్రైమరీ విద్యాబోధనకు అనువైన కొత్త సిలబస్ రూపొందించాలని ఆదేశించారు. 
 
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పాఠశాల విద్య, జగనన్న గోరుముద్ద అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్ కేజీ, యూకేజీ విద్యపై నిర్ణయం తీసుకున్నారు. ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 
ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం జగన్.. తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్కేజీ, యూకేజీ తరగతులను ప్రారంభించాలని నిర్ణయించడం పట్ల అనేక మంది విద్యారంగ నిపుణులు స్వాగతిస్తున్నారు. 
 
ఈ నిర్ణయం వల్ల అనేక మంది పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందనీ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments