Webdunia - Bharat's app for daily news and videos

Install App

బలహీనపడిన అల్పపీడనం... అయినా వర్షాలు కురుస్తాయనంటున్న ఐఎండీ

ఠాగూర్
గురువారం, 26 డిశెంబరు 2024 (15:28 IST)
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడినట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు వర్ష సూచన ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా, దక్షిణ ఆంధ్రా, ఉత్తర తమిళనాడు రాష్ట్రాలకు మాత్రం ఈ వర్ష ముప్పు పొంచివుందని పేర్కొంది. 
 
మరోవైపు, అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందన్నారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో గురువారం కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అందువల్ల జాలర్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని ఐఎండీ సూచన చేసింది. 
 
అదేసమయంలో రాయలసీమ, ఉత్తర కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్పపీడనం బలహీనపడినప్పటికీ, ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం కారణంగా నెల్లూ రు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు, పలు ప్రాంతాల్లో గణనీయ స్థాయిలో వర్షపాతం నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments