Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం.. కన్నబిడ్డ అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి లేపేసింది?

తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్న కొడుకును తన ప్రియుడితో కలిసి హత్య చేసింది ఓ మానత్వంలేని తల్లి.

Webdunia
గురువారం, 30 జూన్ 2016 (08:58 IST)
తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్న కొడుకును తన ప్రియుడితో కలిసి హత్య చేసింది ఓ మానత్వంలేని తల్లి. ఈ దారుణ ఘటన పీణ్యా పరిధిలోని శివపురలో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలను పరిశీలిస్తే...  రేఖమండల్ అనే మహిళకు ఎనిమిదేళ్ల బబ్లిమండల అనే కుమారుడు ఉన్నాడు.
 
ఈమె కొన్నాళ్లుగా విద్యుత్‌మండల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అయితే ఈ సంబంధానికి తన కుమారుడు అడ్డుగా ఉన్నాడని భావించిన రేఖామండల్, ప్రియుడు విద్యుత్ మండల్‌తో కలిసి రెండు రోజుల క్రితం ఆ బాలుడిని దారుణంగా హత్యచేసింది. అనంతరం ఏమీ తెలీనట్టుగా తన కుమారుడు కనబడటం లేదని పీణ్యా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్నికోణాల్లో విచారణ చేపట్టారు. విచారణలో వారే  హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు రేఖామండల్, విద్యుత్ మండల్‌ను బుధవారం అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments