Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతు బంధు పథకంతో చెక్కు కావాలా? అయితే నా కోరిక తీర్చు...

ప్రమాదంలో భర్త చనపోతే భూమినే నమ్ముకుంది ఓ మహిళా రైతు. ఆ భూమికి పట్టా పాస్‌బుక్కు మంజూరు చేయడానికి రైతుబంధు పథకంలో చెక్కు రావాలంటే తన కోరిక తీర్చాలని కామవాంఛను బయటపెట్టారు తహశీల్దారు. తన కోర్కెను తీర్చకపోతే భూమిపై సివిల్‌ కేసు వేయిస్తానని బెదిరించాడు.

Webdunia
బుధవారం, 20 జూన్ 2018 (09:56 IST)
ప్రమాదంలో భర్త చనపోతే భూమినే నమ్ముకుంది ఓ మహిళా రైతు. ఆ భూమికి పట్టా పాస్‌బుక్కు మంజూరు చేయడానికి రైతుబంధు పథకంలో చెక్కు రావాలంటే తన కోరిక తీర్చాలని కామవాంఛను బయటపెట్టారు తహశీల్దారు. తన కోర్కెను తీర్చకపోతే భూమిపై సివిల్‌ కేసు వేయిస్తానని బెదిరించాడు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం, చిన్నిపాడులో బాధితురాలి తల్లికి పేరున ఉన్న 1.06 ఎకరాల భూమికి కొత్త పట్టా పాస్‌బుక్కు, రైతు బంధు చెక్కు మంజూరుచేసింది ప్రభుత్వం. 
 
అయితే సదరు భూమిపై కన్నేసిన ఓ కబ్జా రాయుడు రైతు బంధు చెక్కును, పాస్‌బుక్కును ఆమెకు ఇవ్వకుండా అడ్డుకున్నాడు. దీంతో మానవపాడు తహసీల్దార్‌ను సంప్రదించింది బాధితురాలు. రైతుబంధు చెక్కు కావాలంటే లైంగిక వాంఛ తీర్చాలని వేధించాడు. అందుకు ఒప్పుకోకపోవడంతో అసభ్య పదజాలంతో దూషించాడు తహశీల్దారు. దీంతో తమకు న్యాయం చేయాలని హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించింది మహిళా రైతు.
 
విచారణకు స్వీకరించిన మానవహక్కుల కమిషన్ జోగుళాంబ గద్వాల్‌ జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసి ఘటనపై నివేదిక సెప్టెంబర్‌ 9లోగా అందజేయాలని ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం