మీ బండికి రూ. 100కి పెట్రోల్ కొట్టిస్తే ట్యాంకులోకి రూ.90 ఆయిల్, 11 నెలల్లో రూ. 2 కోట్లు మోసం

ఐవీఆర్
మంగళవారం, 25 ఫిబ్రవరి 2025 (15:56 IST)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్ బంకులను నడిపే పలు యాజమాన్యాలు వినియోగదారులను అడ్డగోలుగా దోచుకుంటున్నట్లు తాజాగా బైటపడింది. అనంతపురంలోని ఓ పెట్రోల్ బంకులో ఏకంగా మీటరునే ట్యాంపరింగ్ చేసి పెట్టేసారు. దాని ప్రకారం మీరు రూ. 100 పెట్రోల్ కొట్టించుకుంటే రూ. 90కి మాత్రమే ఆయిల్ వస్తుంది. మిగిలిన రూ. 10 బొక్కేస్తారు. ఇలా కేవలం 11 నెలల్లో రూ.2 కోట్లు ప్రజల జేబులకు చిల్లు పెట్టి దోచుకున్నట్లు విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో బైటపడింది.
 
ఇటువంటి స్కాం ఇంతవరకూ రాష్ట్రంలో ఎక్కడా చూడలేదనీ, వేసిన సీల్ వేసినట్లే వుందనీ, కానీ అత్యంత చాకచక్యంగా మీటర్ బోర్డులోని చిప్ మార్చేసి మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. దీనితో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇలాంటి బంకులు 80 శాతానికి పైగానే వుంటాయనే చర్చ జరుగుతోంది. మరి మీరు కొట్టించుకునే పెట్రోల్ బంకులో కూడా ఇలాంటి మోసమే జరుగుతుందేమో చెక్ చేసుకోమంటున్నారు అధికారులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments