Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా రెచ్చగొడుతుందమ్మా.. ఎవరూ ఆవేశానికి గురికావొద్దమ్మా..!: చినబాబు ట్వీట్

Webdunia
ఆదివారం, 5 జూన్ 2016 (18:06 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అనంతపురంలో ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రంగా విమర్శలు గుప్పించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో వైకాపా వైఖరిపై చినబాబు నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. టీడీపీ శ్రేణులకు తన సందేశాన్ని పంపారు. వైకాపా పార్టీ రాష్ట్ర వ్యతిరేకి అని.. ఆ పార్టీ నేతల వ్యాఖ్యలను పట్టించుకోవద్దన్నారు. 
 
వైకాపా రెచ్చగొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుందని.. ఇందుకు అనంతలో జగన్ పర్యటన సందర్భంగా ఆయన చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. కాబట్టి ఎవ్వరూ ఆవేశానికి లోనుకావద్దొని పిలుపునిచ్చారు. మన శక్తియుక్తులన్నిటినీ రాష్ట్ర అభివృద్ధి కోసమే వినియోగిద్దామని లోకేశ్ సూచించారు. 
 
ఇకపోతే.. అనంతపురం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్రలో భాగంగా ఓబులదేవరచెర్వు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి స్థానికులని ఉద్దేశించి ప్రసంగించిన జగన్... చంద్రబాబుకి చెప్పులు చూపించడం ఇష్టంలేకపోవడంతో..ఈసారి చెప్పులకు బదులు చీపుర్లు చూపించండని వెల్లడించారు. ఇప్పటికే జగన్ చేసిన చెప్పు వ్యాఖ్యలపై ఆగ్రహంతో ఊగిపోతున్న టీడీపీ శ్రేణులు, తాజాగా చీపుర్ల వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments