నేను సీఎం చంద్రబాబును కాదమ్మా.. డిప్యూటీ సీఎం పవన్‌ను : జనసేన చీఫ్

ఠాగూర్
మంగళవారం, 8 ఏప్రియల్ 2025 (09:12 IST)
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం విశాఖ, మన్యం జిల్లాల్లో పర్యటించి, అడవితల్లి బాట అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కొందరు అభిమానులు సీఎం చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. వెంటనే కల్పించుకున్న పవన్ కళ్యాణ్.. నేను సీఎం చంద్రబాబు నాయుడు కాదమ్మా.. నేను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను అంటూ వ్యాఖ్యానించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అడవి తల్లిని నమ్ముకుంటే అన్నం పెడుతుందని, నీడ నిస్తుందన్నారు. అరకు ఒక అద్భుతమైన ప్రాంతమని, దీనిని అన్ని విధాలుగా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మన్యం ప్రాంతాల్లో సరైన రహదారి లేక గిరిజన పుత్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి రహదారి సౌకర్యం కల్పించి వారి జీవనశైలిని మారుస్తామన్నారు. 
 
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గిరిజన గ్రామాల్లో రూ.1500 కోట్లు విలువ చేసే రోడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. త్వరలోనే ఈ పనులు ప్రారంభమవుతాయని హామీ ఇచ్చారు. తాము ఓట్ల కోసం రోడ్లు వేయడం లేదన్నారు. 
 
అలా అనుకుంటే అరకుతో మన్యం ప్రాంతంలో రోడ్లు వేసేవారం కాదని చెప్పారు. ఎందుకంటే గత ఎన్నికల్లో అరకు ప్రాంత ప్రజలు కూటమి అభ్యర్థులకు ఓట్లు వేయలేదన్నారు. అయినప్పటికీ తమకు కోపం లేదన్నారు. రాజకీయాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Telusu kadaa Review: అమ్మాయిల ప్రేమలో నిజమెంత. సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ రివ్యూ

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments