Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబును బూతులు తిట్టాలని జగన్ చెప్పారు : సారీ అని చెప్పా.. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

వరుణ్
సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (18:09 IST)
వైకాపాకు చెందిన మరో ఎమ్మెల్యే ఆ పార్టీని వీడినున్నారు. ఆయన ఎవరో కాదు.. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. మరో రెండు రోజుల్లో వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు కండువా కప్పుకుంటానని చెప్పారు. 
 
మైలవరం నియోజకవర్గంలోని కార్యకర్తలతో కలిసి చంద్రబాబుకు వద్దకు వెళ్తానని చెప్పారు. పైగా, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుతో తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషాలు, విభేదాలు లేవన్నారు. పార్టీ హైకమాండ్ సమక్షంలో ఇద్దరం కలిసి అన్నీ మాట్లాడుకుంటామని ఆయన చెప్పారు. 
 
అదేసమయంలో ఆయన వైకాపా అధినేత, ఏపీ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, నారా లోకేశ్‌లను వ్యక్తిగతంగా దూషించాలని జగన్ చెప్పారని ఆరోపించారు. మైలవరం టిక్కెట్ ఇస్తానని చెబుతూనే వారిని తిట్టాలని అన్నారని చెప్పారు. వైకాపాలో ఉండలేకే టీడీపీ చేరుతున్నానని తెలిపారు. విపక్ష నేతలను తిట్టేవారికే వైకాపాలో సీట్లు ఇస్తారని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments