Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసిపిలో చేరబోతున్నా, నాతో వచ్చేవారు ఎవరి ఆహారం వాళ్లు తెచ్చుకోండి: ముద్రగడ

ఐవీఆర్
సోమవారం, 11 మార్చి 2024 (13:57 IST)
కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఎట్టకేలకు తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత ఇచ్చారు. మార్చి 14వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపిలో చేరబోతున్నానంటూ బహిరంగ లేఖ రాసారు. కిర్లంపూడి నుంచి తాడేపల్లి వరకూ తన వెంట ర్యాలీగా వచ్చే అభిమానులకు ఓ కీలక విషయాన్ని చెప్పారు.
 
ర్యాలీలో పాల్గొనేవారు ఎవరి ఆహారం వారే తెచ్చుకోవాలనీ, ఎందుకంటే ర్యాలీలో పాల్గొనేవారికి తను ఆహార సరఫరా ఏర్పాట్లు చేయడంలేదని తెలిపారు. వైసిపిలో ఎందుకు చేరుతున్నారనే దానికి సమాధానం ఇస్తూ... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డిని మరోసారి చూడాలనుకుంటున్నట్లు తెలిపారు.
 
తను ఏ పార్టీలో వున్నా పేదల సంక్షేమానికే కట్టుబడి పనిచేస్తానని చెప్పుకొచ్చారు. కాగా కాపు ఉద్యమ నేతగా పేరున్న ముద్రగడ పద్మనాభం వైసిపిలో చేరడంపై రాజకీయంగా ఏపీలో చర్చ జరుగుతోంది. ముద్రగడ చేరికతో వైసిపికి లాభం జరుగుతుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments