వైసిపిలో చేరబోతున్నా, నాతో వచ్చేవారు ఎవరి ఆహారం వాళ్లు తెచ్చుకోండి: ముద్రగడ

ఐవీఆర్
సోమవారం, 11 మార్చి 2024 (13:57 IST)
కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఎట్టకేలకు తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత ఇచ్చారు. మార్చి 14వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపిలో చేరబోతున్నానంటూ బహిరంగ లేఖ రాసారు. కిర్లంపూడి నుంచి తాడేపల్లి వరకూ తన వెంట ర్యాలీగా వచ్చే అభిమానులకు ఓ కీలక విషయాన్ని చెప్పారు.
 
ర్యాలీలో పాల్గొనేవారు ఎవరి ఆహారం వారే తెచ్చుకోవాలనీ, ఎందుకంటే ర్యాలీలో పాల్గొనేవారికి తను ఆహార సరఫరా ఏర్పాట్లు చేయడంలేదని తెలిపారు. వైసిపిలో ఎందుకు చేరుతున్నారనే దానికి సమాధానం ఇస్తూ... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డిని మరోసారి చూడాలనుకుంటున్నట్లు తెలిపారు.
 
తను ఏ పార్టీలో వున్నా పేదల సంక్షేమానికే కట్టుబడి పనిచేస్తానని చెప్పుకొచ్చారు. కాగా కాపు ఉద్యమ నేతగా పేరున్న ముద్రగడ పద్మనాభం వైసిపిలో చేరడంపై రాజకీయంగా ఏపీలో చర్చ జరుగుతోంది. ముద్రగడ చేరికతో వైసిపికి లాభం జరుగుతుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

Satyaprakash: రాయలసీమ భరత్ నటించిన జగన్నాథ్ విడుదలకు సిద్ధం

Sai Durga Tej: డిస్కవర్ ఆంధ్ర టైటిల్, గ్లింప్స్ లాంఛ్ చేసిన సాయి దుర్గ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments