నేను సామాన్య భక్తుడిని, క్యూలైన్‌లో నిలబడి టోకెన్ పొందిన తిరుపతి ఎమ్మెల్యే

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (22:24 IST)
ఆయన ప్రజాప్రతినిధి. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. ప్రముఖుడు. ఎక్కడికైనా వెళ్ళే ప్రోటోకాల్ ఉంటుంది. కానీ సాధారణ భక్తుడిలాగా కౌంటర్ లోకి వచ్చారు. టోకెన్‌ను పొందారు. తిరుమల శ్రీవారిని సామాన్య భక్తుడిలా ఈనెల 27వ తేదీ దర్శించుకోబోతున్నారు. ఆయనెవరో కాదు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి.
 
వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టోకెన్లను టిటిడి విడుదల చేసిన నేపథ్యంలో టోకెన్ కేంద్రాలను పరిశీలించేందుకు ఎమ్మెల్యే స్వయంగా వచ్చారు. ఐదు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 50 టోకెన్ కేంద్రాలను పరిశీలించారు. క్యూలైన్లో భక్తులకు శానిటైజర్ ఇవ్వడం.. దాంతో పాటు సామాజిక దూరాన్ని పాటించడం చెప్పడం గమనించారు.
 
టిటిడి చేసిన ఏర్పాట్లపై సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు, క్యూలైన్ నుంచి తన ఆధార్ కార్డు చూపించి ఈనెల 27వ తేదీ దర్సనానికి సంబంధించిన టోకెన్‌ను కూడా పొందారు తిరుపతి ఎమ్మెల్యే. ఆ టోకెన్‌ను చూపించిన ఎమ్మెల్యే తను సాధారణ భక్తుడిలాగే తిరుమల శ్రీవారిని వైకుంఠ ద్వాదశి రోజు దర్సించుకుంటానని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments