Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లవాగును కబ్జా చేసి వెంచర్ వేసిన వైకాపా నేత - హైడ్రా నోటీసులు

ఠాగూర్
శనివారం, 28 సెప్టెంబరు 2024 (12:22 IST)
ఏపీ మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో నల్లవాగును కబ్జా చేసి ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు. దీన్ని గుర్తించిన హైడ్రా అధికారులు ఆయనకు నోటీసులు జారీచేశారు. శిల్పా మోహన్ రెడ్డి సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నాగ్సన్‌పల్లిలోని నల్లవాగును ఆక్రమించి వెంచర్ వేసినట్టు హైడ్రా అధికారులను గుర్తించారు. ఇటీవల సర్వే చేపట్టిన అధికారులు వెంచర్‌లోని ఆక్రమణలను తొలగించే పనిలోకిదిగారు. 
 
కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన శిల్పా మోహన్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మాజీ సీఎం దివంగత వైఎస్ఆర్ మంత్రివర్గంలో గృహ నిర్మాణ శాఖామంత్రిగా ఉన్నారు. ఆయన కుటుంబ వ్యాపాలన్నీ హైదరాబాద్‌లో ఉన్నాయి. ఇందులోభాగంగా, తెలంగాణాలో అనేక రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వేశారు. శిల్పా మోహన్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో నల్లవాగును ఆయన కబ్జా చేసి వెంచర్ వేసినట్టు తేలడంతో హైడ్రా అధికారులు ఆయనకు నోటీసులు జారీచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments