Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి ప్రస్తావనతో ఇంటికొచ్చి అత్యాచారం చేసిన మాట్రిమోనిలో పరిచయమైన వ్యక్తి

Webdunia
ఆదివారం, 1 డిశెంబరు 2019 (17:12 IST)
హైదరాబాద్ నగరం ఇపుడు పశువైద్యురాలు ప్రియాంకా రెడ్డి హత్య కేసు ఘటనపై చర్చసాగుతోంది. ఈ ఘటన మరువకముందే ఇపుడు మరో దారుణం జరిగింది. పెళ్లి ప్రస్తావన తెచ్చిన ఓ వ్యక్తి.. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ వ్యక్తి కూడా మాట్రిమోని ద్వారా పరిచయమై ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, నిజాంపేటలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ యువతి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ తన సోదరితో కలిసి అద్దె ఇంట్లో నివశిస్తోంది. వారికి 20 రోజుల క్రితం మాట్రిమోని ద్వారా జయచంద్‌ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. వారం రోజుల క్రితం సుజనా ఫోరమ్‌ మాల్‌ వద్ద బాధితురాలి సోదరితో తమ పెళ్లి విషయమై కలిసి మాట్లాడాడు. 
 
ఈ సందర్భంగా పెళ్లి ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు. ఈ విషయంపై కుటుంబ సభ్యులతో మాట్లాడాలని బాధితురాలి సోదరి చెప్పారు. ఈ పరిచయాన్ని అవకాశంగా తీసుకున్న జయచంద్‌.. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతి వద్దకు వచ్చి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అనంతరం గదిలో ఉన్న నగలతో పరారయ్యాడు. 
 
సాయంత్రం బాధితురాలు సోదరి ఇంటికి రాగా.. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments