Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసాజ్ ముసుగులో వ్యభిచారం... నగ్నంగా పట్టుబడిన అమ్మాయిలు...

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (10:19 IST)
మసాజ్ ముసుగులో గుట్టుచప్పుడుగా కొనసాగుతూ వచ్చిన వ్యభిచారగుట్టును పోలీసులు బహిర్గతం చేశారు. స్పాసెంటర్ పేరుతో ముగ్గురు అమ్మాయిలతో హైటెక్ వ్యభిచారం చేయించిన స్పాసెంటర్ మేనేజరుతో పాటు అమ్మాయిలు, విటులను పోలీసులు అరెస్టు చేశారు.
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు హైదరాబాద్ వెస్ట్‌మారేడ్‌పల్లి ప్రధాన రహదారిలోని ఓ భవనంలో 'స్టూడియో మేక్‌ ఓవర్‌ సెలూన్‌ అండ్‌ స్పా' పేరుతో మాసాజ్‌, సెలూన్‌ కేంద్రాన్ని నిర్వాహకురాలు మమత నిర్వహిస్తుంది.
 
ఈ సెంటర్‌లో మసాజ్‌ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందడంతో ఆ కేంద్రంపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో ముగ్గురు వ్యభిచారులు, ఒక విటుడు, ఈ కేంద్రం మేనేజర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
మేనేజర్‌ శేఖర్‌, విటుడు కిరణ్‌బాబులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించించగా, నిర్వాహకురాలు మమత పరారీలో ఉందని పోలీసులు తెలిపారు. ముగ్గురు వ్యభిచారులను మహేశ్వరంలోని పునరావాస కేంద్రానికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments