Webdunia - Bharat's app for daily news and videos

Install App

వదిన, మరిది వివాహేతర సంబంధం,.. కన్నపేగుకు ఉరి

Webdunia
శుక్రవారం, 5 ఆగస్టు 2022 (08:19 IST)
వదిన, మరిది వివాహేతర సంబంధం కన్నపేగుకు ఉరి వేసేలా చేసింది. మరిదితో ఉన్న అక్రమ సంబంధాన్ని తెంచుకోలేని ఓ వివాహిత తన రెండేళ్ల కుమార్తెకు ఉరేసి చంపేసింది. ఆ తర్వాత తన ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన తెలంగాణాలోని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం బానూరు గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మధ్యప్రదేశ్‌లోని సిమ్రూద్‌ హయ్యర్‌ గ్రామానికి చెందిన గజేంద్ర కుసుబ.. పటాన్‌చెరు మండలంలోని ఓ ప్రైవేటు సంస్థలో కార్మికునిగా పని చేస్తున్నారు. భార్య రేఖ(28) కూతురు సోనమ్‌(2)తో కలిసి బానూరులో నివాసముంటున్నారు. 
 
అయితే, గజేంద్ర సోదరుడు బసుదేవ కుసుబ(27) బానూరులోని సోదరుని ఇంటి పక్కనే నివాసముంటూ స్థానికంగా ఓ పరిశ్రమలో పనికి చేరాడు. అయితే, రేఖకు, కుసుబలు వారి స్వగ్రామంలో ఉన్నప్పుడే వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం బహిర్గతం కావడంతో పంచాయతీ పెద్దల వరకు వెళ్లింది. 
 
ఆ తర్వాత బసుదేవ నందిగామ వచ్చిన తర్వాత కూడా ఆ బంధాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి వదిన మరిది ఏకాంతంగా గడుపుతున్నారు. దీన్ని గజేంద్ర కళ్ళారా చూశాడ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ కూతురు సోనమ్‌కు చీరతో ఉరి వేసిన రేఖ, ఆపై బసుదేవతో కలిసి అదే చీరకు ఉరి వేసుకుని కనిపించింది. ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, గజేంద్ర పక్క గదిలో ఉండగానే ఈ దారుణం జరిగింది. దీనిపై స్థానిక పోలీసుల కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments