Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్కింటి అంకులే పాడుపనికి పాల్పడ్డాడు...

Webdunia
సోమవారం, 11 నవంబరు 2019 (19:44 IST)
హైదరాబాద్, ఇబ్రహీంపట్నం సమీపంలోని నల్లకుంటలో చిన్నారి అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. ఈ చిన్నారి హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ చిన్నారి నివసించే ఇంటికి పక్కనే ఉన్న ఇంట్లోనే దారుణ హత్యకు గురికావడం ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. 
 
కాగా, ఇబ్రహీంపట్నానికి చెందిన ఎనిమిదేళ్ల బాలిక ఆదివారం సాయంత్రం 3 గంటలకు ఆడుకోడానికి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బాలిక తల్లి ఇంటి పక్కనే ఉన్న కాళాశాలలో స్వీపర్‌గా పనిచేస్తోంది. ఈమె పని ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత కూడా పాప రాలేదు. దీంతో చుట్టుపక్కల గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం ఆ ప్రాంతంలో ఉన్న అన్ని సీసీటీవీ పుటేజీ కెమెరాలను పోలీసులు పరిశీలించినా ఆధారాలు లభించలేదు. దీంతో చుట్టుపక్కల ఇళ్లను తనికీలు చేశారు. ఈ నేపథ్యంలో బాలిక ఉంటున్న పక్కింట్లో చిన్నారి మృతదేహం లభ్యమైంది. 
 
దీంతో ఆ ఇంట్లో నివసించే ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడా? లేక ఏమైనా గొడవలు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments