Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంబీఏ గోల్డ్‌మెడల్... జల్సాల కోసం ఏం చేశాడో తెలుసా?

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (13:44 IST)
అతనో ఎంబీఏ పట్టభద్రుడు. పైగా గోల్డ్‌మెడలిస్టు. ఉన్నత విద్యను పూర్తి చేసినా తనలోని వ్యసనాలను మాత్రం మానలేక పోయాడు. దీంతో జల్సాల కోసం దొంగతనాలకు అలవాటుపడ్డాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రకాశం జిల్లాకు చెందిన వంశీకృష్ణ 2004లో ఎంబీఏ పూర్తి చేసి గోల్డ్‌‌మెడల్‌ సాధించాడు. తర్వాత ఉద్యోగం కోసం పలు కంపెనీల మెట్లెక్కిదిగాడు. కానీ, ఎక్కడా సరైన ఉద్యోగం లభించలేదు. అదేసమయంలో మనోడు జల్సాలకు అలవాటుపడ్డాడు. ఫలితంగా గోల్డ్‌మెడలిస్టు కాస్త దొంగగా మారిపోయాడు. 
 
తన మకాంను ప్రకాశం జిల్లా నుంచి హైదరాబాద్‌కు మార్చాడు. హైదరాబాద్ నగరంలో తాళం వేసి ఉన్న గృహాలను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడసాగాడు. చోరీ సొమ్మును ముత్తూట్‌ ఫైనాన్స్‌లో కుదుపెట్టి ఆ డబ్బుతో లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడి ఎంజాయ్ చేయసాగాడు. ఇలా ఒకసారి రెండు సార్లు కాదు ఏకంగా 13 ఏళ్లుగా దొంగతనాలకు పాల్పడుతూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో 2006 నుంచి పలుమార్లు పోలీసులకు చిక్కినప్పటికీ తన వృత్తిని మాత్రం మానలేదు. ఈ క్రమంలో కమిషనరేట్‌ పరిధిలో వరుస దొంగతనాలపై నిఘా పెంచిన పోలీసులు వంశీకృష్ణను ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. అతనివద్ద నుంచి 800 గ్రాముల బంగారం, రూ.1.50 లక్షల నగదు సహా రూ.30 లక్షల ఇతరత్రా వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments