Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాంపల్లి ఎగ్జిబిషన్‌లో మంటలు.. ఫైరింజిన్ ఉంది.. కానీ నీళ్లు లేవు...

Webdunia
గురువారం, 31 జనవరి 2019 (09:30 IST)
హైదరాబాద్‌లోని నాంపల్లి నుమాయిష్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రతి యేడాది జనవరి ఒకటో తేదీన ప్రారంభమై ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఈ ప్రదర్శన జరుగుతుంది. దీన్ని తిలకించేందుకు 45 రోజుల్లో దాదాపు 30 లక్షల మంది వరకు వస్తుంటారు. కానీ, బుధవారం ఈ ప్రదర్శనలో ఉన్నట్టుండి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి 7 గంటల ప్రాంతంలో మహేష్ బ్యాంక్ స్టాల్‌లో ఏర్పాటు చేసిన ఏటీఎం కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. 
 
మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో అక్కడే ఉన్న అగ్నిమాపకదళ సిబ్బందికి సమాచారం చేరవేశారు. అయితే, తమ పై అధికారులకు సమాచారం చేరవేయడం మినహా మరేం చేయలేక పోయారు. దీనికి కారణం... ఎగ్జిబిషన్‌ ప్రాంగణంలో ముందస్తుగా ఉంచిన ఫైరింజన్‌లో చుక్క నీరు లేదు. దీంతో సిబ్బంది ఏం చేయలేక మంటలను చూస్తుండిపోయారు. 
 
ఫైరింజన్‌లో నీరు ఉండివుంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగివుండేది కాదని, కేవలం రెండు నిమిషాల్లో వచ్చి మంటలను ఆర్పివుండవచ్చని స్టాల్స్ నిర్వాహకులు వాపోతున్నారు. తమవద్ద నుంచి అద్దెలు, కరెంట్ బిల్లుల పేరిట లక్షల రూపాయలు దోచుకుంటున్న నుమాయిష్ నిర్వాహకులు, ఇప్పుడు నష్టాన్ని భరించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఎగ్జిబిషన్‌లో ఖాళీ ఫైర్ ఇంజన్‌ను నిలిపివుంచడంపైనా విమర్శలు వస్తున్నాయి. 
 
మరోవైపు, అగ్నిప్రమాదం వందలాది మంది వ్యాపారులకు నిద్రలేని రాత్రులను మిగిల్చింది. మంటలు ఒక్కో దుకాణానికి వ్యాపిస్తుంటే, ఎక్కడి వస్తువులను అక్కడే వదిలేసి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పారిపోయారు. సందర్శకులు మాత్రం తమ చేతికి దొరికిన వస్తువులను దొరికినట్టు దొరకబుచ్చుకుని బయటి గేట్ల వైపు పరుగులు తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments